పంత్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది…సాహకి ఛాన్స్ ఇవ్వండి
వెస్టిండీస్తో రెండో టెస్టులో వృద్ధిమాన్ సాహాను ఆడించాలని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ సూచించారు. రిషభ్ పంత్ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని వెల్లడించాడు. కానీ అతడు దేవుడిచ్చిన వరం. నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని పంత్ గురించి పేర్కొన్నారు. సాహా దురదృష్టవశాత్తు గాయాల పాలయ్యాడు. అతడికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. జట్టులో చోటివ్వకుండా అతడిని ఎంపిక చేయడంలో అర్థం ఏముంది? ప్రదర్శనల ఆధారంగా న్యాయం చేయాలి. దేశవాళీ స్థాయిలో రాణించే అతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అతడు వెలుగులో లేకపోతే పంత్, కార్తీక్ లాంటి వాళ్లు వస్తారు. ఇప్పుడు మనం చూడాల్సింది బ్యాటింగ్, వికెట్ కీపింగ్లో నిలకడగా రాణించేది ఎవరా అని’ అని కిర్మాణీ అన్నారు.