దేశంలోనే నెం.2గా తెలంగాణ: ఈఎస్ఎల్ నర్సింహన్
హైదరాబాద్: రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందని, ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ నర్సింహన్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు లబ్ధి చేకూరేలా జరగాలని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి ఆశయాలకు అనుగుణంగా సభ కొనసాగాలని ఆకాంక్షించారు.
సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రజల వద్ద పాలన చేరడానికి ఇది దోహదం చేస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన ఆరెళ్లలోనే విద్యుత్ సమస్యను తీర్చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని విద్యుత్ లోటు స్థితి నుంచి మిగులు విద్యుత్ స్థాయికి తీసుకొచ్చామని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిపై దీర్ఘ దృష్టితో వ్యవహరిస్తున్నామని తెలిపారు. 24గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.