జీవికే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్ లో 49 శాతం వాటా విక్రయం

ముంబైలో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహించిన జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు విదేశీ సంస్థలు ముందుకొచ్చినట్టు  సమాచారం. దీనికోసం అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌)కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ (పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్‌)తో జీవికే గ్రూపు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ముంబాయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏల్‌) జీవీకే గ్రూపు సంస్థ అనే విషయం తెలిసిందే. కన్సా ర్షియంలో ఈ కంపెనీలన్నిటికీ సమాన వాటా ఉండ నుంది. డీల్‌ విలువ సుమారు రూ.6,000 కోట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎయిర్‌పోర్ట్‌ విలువ రూ. 12,000 కోట్ల విలువ కట్టినట్టు సమాచారం. ఇన్వెస్టర్లు జివికే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్ బోర్డులో చేరి, సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకోనున్నారు.

ముంబై విమానాశ్రయాన్ని 2006 నుంచి నిర్వహిస్తున్న జీవీకే.. నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టును రూ.16,704 కోట్లతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఎంఐఏఎల్‌కు 74% వాటా, సిటీ అండ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు(సిడ్కో) మిగిలిన వాటా ఉంది. ఈ విమానాశ్రయ పనులు 2020 మధ్యలో ప్రారంభమవుతాయి. జీవీకే రూ.5,750 కోట్ల వరకు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్‌ఐఐఎఫ్, ఏడీఐఏతో నాన్‌ బైండింగ్‌ ఒప్పందాన్ని చేసుకుంది.  దీనిద్వారా వచ్చిన నిధులతో ఎంఐఏఎల్‌లో బిడ్‌వెస్ట్, ఏసీఎస్‌ఏలకు ఉన్న వాటాలను జీవీకే కొనుగోలు చేయనుంది. ఎంఐఏఎల్‌లో జీవీకే వాటా 50.5% కాగా, బిడ్‌ సర్వీసెస్‌ డివిజన్‌కు (మారిషస్‌) 13.5%, ఏసీఎస్‌ఏ గ్లోబల్‌కు 10%, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి 26% వాటా ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *