పొరుగు దేశాల్లోని హిందువులు భారత్ బాట

వాఘా: దాయాది దేశం పాకిస్తాన్ నుంచి దాదాపు 200మంది హిందువులు సోమవారం భారత్‌కు వచ్చారు. అత్తారి-వాఘా సరిహద్దు గుండా దేశంలోని వచ్చిన వీరు.. పాకిస్తాన్‌లో తాము తీవ్ర అభద్రతాభావంతో ఉన్నామని, తిరిగి ఆ దేశానికి వెళ్లాలంటే భయంగా ఉందని చెప్తున్నారు. భారత పౌరసత్వం లభిస్తే సంతోషంగా స్వీకరిస్తామని, ఇక్కడే సుఖంగా బతుకుతామని వేడుకుంటున్నారు. పాక్‌లో తమ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ముఖ్యంగా హిందూ బాలికలు కనిపిస్తే చాలు కిడ్నాప్ చేసేస్తున్నారని కొందరు మహిళలు చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. ప్రస్తుతం విజిటింగ్ వీసాలతో ఉన్న వీరంతా తమకు భారత పౌరసత్వం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
                      ఇలానే పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన నాలుగు సిక్కు కుటుంబాలను రిసీవ్ చేసుకోవడానికి శిరోమణి అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిక్రా కూడా అత్తారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంగళవారం కలిసి, వీరికి సాధ్యమైనంత త్వరగా భారత పౌరసత్వం ఇప్పించేలా చూస్తానని చెప్పారు. సిటిజెన్‌షిప్ అమెండ్‌మెట్ యాక్ట్(సీఏఏ) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పొరుగు దేశాల్లోని చాలామంది హిందువులు భారత్ బాట పట్టినట్లు తెలుస్తోంది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *