నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో ప్రారంభం
హైదరాబాద్ ప్రజలకు ఇదో స్వీట్ న్యూస్. భాగ్యనగర వాసులకు ఇక ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. తొలి దశ మెట్రో పరుగుకు ముహూర్తం ఖరారు అయ్యింది. నాగోల్ నుంచి మియాపూర్ మధ్య మెట్రో రైలు ప్రారంభంకానున్నది. మెట్రో తొలి దశ రైల్వే సర్వీస్ను నవంబర్ 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించన్నారు. నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మెట్రో ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోదీకి బుధవారం సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖను మంత్రి కేటీఆర్ ఇవాళ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.