చిరంజీవికి జోడీగా గోవబ్యూటి?
మెగాస్టార్ చిరంజీవి సైరా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా గోవా బ్యూటీ ఇలియానా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రా యూనిట్ ఇలియను కలిసి కథను వివరించగ ఆమె ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాజల్, అనుష్క పేర్లు వినిపించాయి.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ కొణేదల ప్రోడెక్షన్ లో నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయక. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి,తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.