యుద్ధానికి సిద్ధం :ఇమ్రాన్ ఖాన్
ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో దాయాది దేశం భారత్పై విద్వేషపూరిత వైఖరి ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించిన ఇమ్రాన్ఖాన్ మరోసారి నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. కశ్మీర్కు స్వాతంత్ర్యం సాధించేందుకు భారత్తో యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. పాక్ ఆర్మీ, ప్రజలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనలను ఎంతమాత్రం సహించబోము. భారత్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాము’ అని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకపక్క పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ప్రజలను భ్రమల్లో జీవించడం మానేయండి అంటుంటే ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.