దేశంలో సంచలనం…

త్వరలోనే దేశంలో ఎదో జరగబోతోంది…అతి త్వరలో దేశంలో ఎదో “సంచలనం” జరగబోతోంది-జాగ్రత్త . ‘ఆర్‌బిఐ’  ఆల్ ఆఫీసర్స్ లీవ్ ఒక్కసారిగా రద్దు చేయడం దీనికి ఆనవాలు. ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముందు భారీ ఆర్ధిక మాంద్యం పొంచి వుంది. భారతదేశంలో ఇప్పుడు  ప్రకటించని ఆర్థిక సంక్షోభం ఉంది. ప్రస్తుత పరిస్థితి సంక్షోభం యొక్క మొదటి రౌండ్ మాత్రమే. ఈ మధ్యే బ్యాంకుల ‘ఎన్‌పిఎ’ ను పెంచారు. దీనిని బట్టి మూలధన కొరత అంటే తాజాగా పెట్టుబడి లేదు అని అర్ధం. గృహాలను కొనుగోలు, అమ్మకాలు చేయడం తగ్గిపోయింది. అంటే ఉక్కు, సిమెంట్, బాత్రూమ్ అమరికలు, నిర్మాణాలు క్షీణించడం. దీని వలన  బ్యాంకుల లో ‘ఎన్‌పిఎ’లు ఇంకా పెరుగుతాయి. ఈ ఎన్‌పిఎలు సంక్షోభాన్ని మరింత ఎక్కువ చేయడం ద్వారా వ్యక్తిగత స్థాయికి కూడా రావచ్చు. వాహన అమ్మకాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మొదటిసారి ద్విచక్ర వాహనాల అమ్మకం ప్రతికూల వృద్ధిని చూపుతోంది. మారుతి ఉత్పత్తిని 50% తగ్గించింది. చాలా మంది ఆటో డీలర్లు మూసివేస్తున్నారు.

ఈ మూడు విషయాలు కోటి ఉద్యోగాల తొలగింపుకు మరియు ప్రభుత్వ పన్ను ఆదాయాన్ని తగ్గించడం పై ప్రబావితం చూపుతాయి. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం  ప్రతిదానిపై పన్నులు వేయడం ద్వారా తన నష్టాన్ని పూర్తి చేయాలనుకుంటుంది,లేదా ప్రభుత్వం లాభాలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తుంది మరియు ఆ నష్టాన్ని (లోటును) ప్రభుత్వ ఖాతాలో చూపుతుంది. అందువలన కూడా  నష్టాలు పెరుగుతాయి.

భారతదేశంలో ఈ సంక్షోభం మార్చి 2020 లో సామాన్య ప్రజల స్తాయికి వచ్చేట్లు కనిపిస్తుంది, సగటు భారతీయులలో చాలామందికి దీని గురించి తెలియదు. పతంజలి, హిందూస్తాన్ లివర్ వంటి అగ్ర సంస్థలు కూడా వృద్ధిలో లేకుండా పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సబ్బు, టూత్‌పేస్ట్, హెయిర్ ఆయిల్, బిస్కెట్లు వంటి వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులకు కూడా డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఎంట్రీ లెవల్ కార్లను తయారుచేసే “ఎఫ్‌ఎంసిజి”, ద్విచక్ర వాహనాలు,ఆటో కంపెనీలు లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాల మీద ఆధారపడిన ఆ వ్యాపారాల అభివృద్ధిని కూడా మందగించింది. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం వల్ల సరుకు డిమాండ్‌పై స్పష్టమైన ప్రభావం ఉంది. ట్రక్కుల ద్వారా రవాణాకు ఎక్కువ అవకాశాలుండే ఉత్పాదక రంగం నుండి డిమాండ్ కనీస స్థాయిలో కూడా లేదు.

గత ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్ మరియు జూన్ మధ్య, ఫ్లీట్ యుటిలైజేషన్ 25% నుండి 30% కి తగ్గింది. కనుక ఇది రవాణాదారుల ఆదాయాన్ని కూడా 30% తగ్గిస్తుంది. నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల నెలవారీ ఖర్చు తగ్గింది. ఏప్రిల్‌ తరువాత వ్యవసాయంలో రవాణా దాదాపు మందగించింది. జూన్‌లో “ఎఫ్‌ఎంసిజి” ద్వారా పండ్లు, కూరగాయల డిమాండ్ 20% తగ్గింది. సరుకు రవాణా డిమాండ్ తగ్గడం వల్ల, మొదటి త్రైమాసికంలో ట్రక్ బాడుగలు దేశంలోని అన్ని ప్రధాన మార్గాల్లో 30% తగ్గాయి. ఈ స్థితిని సరిదిద్దటానికి ప్రభుత్వం ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆర్ధిక మంత్రి ట్వీట్లు ఆ దిశగానే వున్నాయి కానీ ఏమిటో తెలీదు. “సమ్ థింగ్ టూ బిగ్”  త్వరలోనే దేశంలో ఎదో జరగబోతోంది. జాగ్రత్త గా ఉండండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *