5 పరుగుల తేడాతో 3 వికెట్లు డౌన్‌

చెన్నై: చెపాక్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ మొయిన్‌అలీ (44; 97 బంతుల్లో 4×4) వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా వేసిన 71.2వ బంతిని సరిగ్గా అంచనా వేయని అలీ మిడ్‌ఆన్‌లో ఫీల్డర్‌ అశ్విన్‌ చేతికి చిక్కాడు. నిలకడగా ఆడుతున్న బెన్‌స్టోక్స్‌ (23; 54 బంతుల్లో 4×4) సైతం జడేజా బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. 73.2 బంతిని స్టోక్స్‌.. కాస్త ముందుకొచ్చి డిఫెన్స్‌ ఆడబోయాడు. బ్యాట్‌కు తాకి పైకి లేచిన బంతిని త్రిశతక వీరుడు కరుణ్‌ నాయర్‌ అందుకొన్నాడు.

ఆ తర్వాతి ఓవర్‌ 6వ బంతికి అమిత్‌ మిశ్రా చక్కని గూగ్లీకి తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం బాదిన లియామ్‌ డాసన్‌ (0)ను డకౌట్‌ చేసి ఇంగ్లాండ్‌ నడ్డి విరిచాడు. ప్రత్యర్థి నాలుగో వికెట్‌ను 129 పరుగుల వద్ద కోల్పోగా ఐదో వికెట్‌ను 192 వద్ద కోల్పోయింది. ఆ తర్వాత ఒక పరుగు తేడాలోనే 6వ వికెట్‌ కోల్పోగా డాసన్‌ 196 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. 74 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్‌ 193/6తో ఉంది. జడేజా 5 వికెట్లు పడగొట్టాడు. 75 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 196/7తో ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *