సముద్ర తీర అలలపై…కోహ్లీ
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ తొలి పోరులో విజయాన్ని టీమిండియా వేడుక చేసుకుంటోంది. ఆటగాళ్లంతా విభిన్నంగా ఆస్వాదిస్తున్నారు. రెండో టెస్టుకు కాస్త విరామం లభించడంతో ఆ సమయాన్ని కరీబియన్ దీవుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. సారథి విరాట్ కోహ్లీ అతడి సతీమణి అనుష్క శర్మ యాచ్పై సముద్ర తీరంలో అలలపై విహరించారు. వారితో పాటు కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను రాహుల్, అశ్విన్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. మంచి వ్యాఖ్యలు పెట్టారు. చిత్రంలో వారు ‘విజయం’ చిహ్నాలు చూపించారు.