శ్రీలంకతో టీ20 సిరీస్లో అదరగొట్టిన భారత క్రికెటర్లు
దుబాయ్: శ్రీలంకతో టీ20 సిరీస్లో అదరగొట్టిన భారత క్రికెటర్లు ఐసీసీ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లోనూ దూసుకెళ్లారు. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆరోస్థానంలో నిలువగా టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ చెరో స్థానం ఎగబాకారు. ఐసీసీ ర్యాంకింగ్స్లో రాహుల్ అత్యుత్తమ ర్యాంకు కలిగిన భారత బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. లంకతో టీ20 సిరీస్లో 45, 54 పరుగులతో రాణించిన రాహుల్ ఏకంగా 26 పాయింట్లు సాధించి 760 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కన్నా కేవలం ఆరు పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు.టెస్టు, వన్డేల్లో టాప్ ర్యాంకు ప్లేయర్గా ఉన్న కోహ్లీ 683 రేటింగ్ పాయింట్లతో టీ20ల్లో మాత్రం తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నాడు. ధావన్ 15వ స్థానంలో నిలువగా మనీశ్ పాండే నాలుగు స్థానాలు మెరుపరచుకొని 70వ ర్యాంకులో నిలిచాడు. బుమ్రా 8 పాయింట్లు పొంది 39వ ర్యాంకులో ఉన్నాడు.