హేబా పటేల్ – తేజస్వినికి గాయాలు
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లు అయిన హేబా పటేల్, తేజస్విని మాదివాడ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడినట్టు బ్రేకింగ్ న్యూస్ అందింది.గురువారం సాయంత్రం హైదరాబాద్లో వీరిద్దరు ఓ స్కూటర్పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో వీరిద్దరికి గాయాలైనట్టు తెలుస్తోంది. వీరిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారట.
ఇక కుమారి 21 ఎఫ్ సినిమాతో టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో కుమారిగా ముద్ర వేయించుకున్న హేబా పటేల్ తాజాగా నిఖిల్ హీరోగా వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కూడా నటించింది. ఇక రాంగోపాల్ వర్మ ఐస్క్రీం సినిమాలో నటించిన విజయవాడ అమ్మాయి తేజస్విని మాదివాడ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ మరదలిగా నటించింది. ఇక త్వరలో సెట్స్మీదకు వెళ్లే వెంకటేష్ ఆడాళ్లా మీకు జోహార్లు సినిమాలో సైతం వెంకీకి మరదలిగా నటించనుంది.