‘ఫోన్‌పే ఏటీఎం’ను ప్రవేశపెట్టింది

ఆన్‌లైన్‌ లావాదేవీల సంస్థ ‘ఫోన్‌పే’ తన వినియోగదారులకు మరో మంచి సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాలో డబ్బున్నా.. నగదు అవసరమైనప్పుడు దగ్గర్లో ఏటీఎం లేకపోతే ఇబ్బందులు పడుతుంటాం. ఇక ఇలాంటి ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం దక్కనుంది. ఇప్పటి వరకూ చెల్లింపుల సదుపాయం మాత్రమే కల్పించిన ఈ యాప్‌ నగదు ఉపసంహరణకు ‘ఫోన్‌పే ఏటీఎం’ను ప్రవేశపెట్టింది. ఫోన్‌పే వినియోగదారులు ఈ యాప్‌ సదుపాయం ఉన్న దుకాణాదారుల వద్ద దీని ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఒక వినియోగదారుడు కేవలం రూ.వెయ్యి మాత్రమే పొందే అవకాశం ఉంది. యాప్‌ ఓపెన్‌ చేసి స్టోర్స్‌లోకి వెళ్లి ఫోన్‌పే ఏటీఎం మీద క్లిక్‌ చేస్తే మన దగ్గరలో ఫోన్‌పే సదుపాయం గల దుకాణాలు కనిపిస్తాయి. అయితే, దీన్ని ప్రయోగాత్మకంగా దిల్లీలో గురువారం అందుబాటులోకీ తీసుకొచ్చారు. ఈ సదుపాయం ద్వారా మన బ్యాంకు ఖాతాలోని  దుకాణదారుడి దగ్గరకు వెళ్లి అతని వద్ద మనం నగదు తీసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని సంస్థ ప్రకటించింది. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు నగదు లావాదేవీల్లో ఇబ్బందులను తొలగించేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకీ తీసుకొచ్చామని సంస్థ తెలిపింది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *