ఐపీల్ ipl 2021 మ్యాచ్ 32 రాజస్థాన్ vs పంజాబ్ Preview Final 11
IPL 2021 Match 32 Punjab Kings vs Rajasthan Royals Preview
ఐపీల్ 2021 మ్యాచ్ 32 రాజస్థాన్ మరియు పంజాబ్ మధ్య మంగళవారం నాడు సాయంత్రం 7:30 కి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరగనున్నది. వరుసగా 6వ మరియు 7వ స్థానం లో ఉన్న ఈ రెండు టీం లకు గెలుపు ముఖ్యం.
ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 3 గెలిచి, 4 మ్యాచ్ లలో ఓడింది. పంజాబ్ 8 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ లలో గెలిచి 5 ఓడింది. రాజస్థాన్ కు చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రే ఆర్చర్ వెళ్లిపోవడంతో ఒకింత కష్టాల్లో పడింది. పంజాబ్ ఆటగాడు డేవిడ్ మలాన్ కూడా వెళ్ళిపోయాడు.
ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీల్ లో 22 సార్లు తలపడగా, రాజస్థాన్ 12 సార్లు గెలిస్తే, పంజాబ్ 10 సార్లు గెలిచింది. కానీ ఈ సీజన్లో మొదటి మ్యాచ్ లో మాత్రం పంజాబ్ గెలిచింది. కే ఎల్ రాహుల్ కెప్టెన్ లో పంజాబ్ టీం పటిష్టంగా ఉన్నప్పటికినీ ఈ సీజన్లో అంతగా రాణించలేదు. ఇక రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫార్మ్ లో ఉంటె ఆ టీం కి పరుగుల కొరత ఉండదు.
డు ఆర్ డై మ్యాచ్ ఇద్దరికీ కూడా, దుబాయ్ పిచ్ మొదట బాటింగ్ చేసిన వారికి గెలిచే అవకాశం ఎక్కువ, కాబటికి టాస్ గెలిచినా జట్టు మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఇక్కడ ఆడిన 27 మ్యాచ్ లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 17 సార్లు గెలిచింది.