హాట్ కేక్ – జై లవకుశ
ఇటీవలి కాలంలో సేల్స్ ఓపెన్ చేసిన వన్ డే లో తెలుగు సినిమా హక్కులు హాట్ కేక్స్ లా అమ్ముడయిన సినిమా ఏదీ అని అడిగితే, టక్కున చెప్పేయచ్చు, జై లవకుశ అని. అవును, నిజమే. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ సినిమా థియేటర్ రైట్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి 70 కోట్లకు అమ్ముడయిపోయాయి. పైగా దీనికి జీఎస్టీ అదనం. అంటే జీఎస్టీని కొనుక్కున్నవాళ్లే భరిస్తారన్నమాట.
దసరాకు విడుదలవుతున్న జై లవకుశ టీజర్ ఇటీవల విడదలయి సంచలనాలు నమోదు చేసింది. జై లవకుశ సినిమాను నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. సీడెడ్ లో హారిక హాసిని వాళ్ల సినిమాలు కో రెగ్యులర్ గా విడుదల చేసే బయ్యర్ గంగాధర్ అండ్ తీసుకున్నారు. ఇక ఆంధ్ర ఏరియాలను సుధాకర్ (గుంటూరు, కృష్ణ), భరత్ చౌదరి (ఈస్ట్), ఉషాపిక్చర్స్(వెస్ట్) , డాక్టర్ పవన్ (నెల్లూరు) కొన్నారు. విశాఖ ఇంకా అలా వుంచినట్లు వినికిడి. ఆ రేషియో ప్రకారం జీఎస్టీతో కలిపి 9 కోట్లు ఫిక్స్ చేసారు. ఈస్ట్ లో హయస్ట్ ప్రయిస్ ఆరు కోట్లకు పైగా చెల్లించారు.
మొత్తంమీద ఆంధ్ర 36 కోట్ల రేషియోలో విక్రయించారు. సీడేడ్ 13.5 కోట్లకు, నైజాంలో ఇరవై కోట్లు, అంటే మొత్తం జీఎస్టీ కాకుండా 70 కోట్లకు విక్రయించారు. ఇటీవలి కాలంలో ఈ రేంజ్ లో అమ్ముడయింది జై లవకుశనే. ఎందుకంటే స్పైడర్ కూడా ఇదే రేషియోలోనే అమ్మాలని అనుకున్నారు కానీ, జీఎస్టీ అదనం అన్నది లేదు. అలాగే ఆంధ్రలో ఎన్టీఆర్ కు వున్న మాస్ ఇమేజ్ మహేష్ కు లేకపోవడం అన్నది చిన్న మైనస్. అందువల్ల ఆంధ్ర ముఫై నుంచి ముఫై మూడు దగ్గర క్లోజ్ అవుతుంది.
స్పైడర్ కు నైజాంలో మాత్రం జై లవకుశ కంటే కాస్త అదనంగా వచ్చే అవకాశం వుంది. విశాఖ స్పైడర్ జీఎస్టీతో కలిపి 8.10కు ఇచ్చారు. జై లవకుశ జీఎస్టీతో కలిపి తొమ్మిది చిల్లరకు ఇచ్చారు.