ఏసీబీ దాడి లో జూబ్లి హిల్స్ ఎస్ఐ , పరారీలో సీఐ
హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. జూబ్లి హిల్స్ ఎస్ఐ సుధీర్ రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కేసులో ఒకరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ సుధీర్ రెడ్డి రూ.50వేలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. ఆ డబ్బుల కలెక్షన్ కోసం తన సోదరుడి కొడుకుని మధ్యవర్తిగా నియమించాడు. ఏసీబీ అధికారులు వలవేసి ఎస్ఐ సుధీర్ రెడ్డి, అతడి అన్న కొడుకు ఇద్దరినీ పట్టుకున్నారు. మరోవైపు సీఐ బలవంతయ్య మీద కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ దాడి విషయం తెలిసిన వెంటనే సీఐ బలవంతయ్య పరార్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.