కాజల్ మైనపు విగ్రహాన్ని కాజల్ ఆవిష్కరించారు
సినీ రంగానికి చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను ఆవిష్కరిస్తున్న మేడమ్ టుస్సాడ్స్ ఇప్పుడు దక్షిణాదికి చెందిన అగ్ర హీరోయిన్స్లో ఒకరైన కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్లో ఆవిష్కరించారు. తన మైనపు విగ్రహాన్ని కాజల్ ఆవిష్కరించుకున్నారు. తన అభిమానులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కమల్హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న `ఇండియన్ 2`లో హీరోయిన్గా నటిస్తున్నారు.