కల్యాణ్ రామ్ తిడుతూ ఎస్‌ఎంఎస్ పెట్టాడు: మంచు విష్ణు

ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ నేపథ్యంలో మలేషియాలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో హీరో మంచు విష్ణు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందో హీరో మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా వివరించాడు. తనకు ఈ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఎంతోమంది ఫోన్ చేశారని విష్ణు చెప్పాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి తన తల్లిదండ్రులకు, భార్యకు, తమ్ముడికి, చెల్లికి సారీ చెబుతున్నానని భావోద్వేగానికి లోనయ్యాడు. తాను ఒక చిన్న జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఎంతో బాధపడాల్సి వచ్చిందని విష్ణు చెప్పుకొచ్చాడు. శ్రేయోభిలాషులు, అభిమానులను క్షమాపణ కోరుతున్నట్లు విష్ణు చెప్పాడు. రెండుమూడు రోజుల్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.
తన తప్పు లేదన్న విషయం ఆ వీడియో చూస్తే అందరికీ తెలుస్తుందని విష్ణు చెప్పాడు. తాను కోలుకుని.. ఇలా అందరి ముందు మాట్లాడుతున్నానంటే.. నిజంగా అది దేవుడిచ్చిన వరమని విష్ణు ఉద్వేగానికి లోనయ్యాడు. మోకాలికి దెబ్బ తగిలిందని, భుజం రోడ్డుకు బాగా గీసుకుపోయిందని విష్ణు తెలిపాడు. నితిన్ ఏం జరిగిందని ఫోన్ చేశాడని చెప్పాడు. కల్యాణ్ రామ్ అయితే తిడుతూ ఎస్‌ఎంఎస్ పెట్టాడని, పిల్లలున్నారని, రిస్క్ ఎందుకు చేస్తావని తన మంచి కోరి కొంచెం ఘాటుగా ఎస్‌ఎంఎస్ పెట్టినట్లు మంచు విష్ణు వివరించాడు. తను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ మంచు విష్ణు ధన్యవాదాలు తెలిపాడు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *