సింగరేణి కార్మికులకు బోనస్…కేసిఆర్
సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతం బోనస్ గా ఇస్తున్నట్లు తెలంగాణ సిఎం కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్ చెల్లిస్తామన్నారు. దీని వల్ల ఒక్కో కార్మికుడు గత ఏడాది కంటే రూ.40,530 అదనంగా పొందుతారని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు సంతృప్తినిచ్చాయని అన్నారు. పోలీసులకు వారాంతపు సెలవులు అంతా సులువు కాదని అయిన ఈ విషయంపై జిజేపి, ఇతర ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా హోమ్ గార్డ్ లకు మంచి వేతనం అందిస్తున్నామన్నారు.