కేసీఆర్ ఢిల్లీ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎంకేసీఆర్ ఢిల్లీ పర్యటన …. సోమవారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరి మంగళవారం ప్రధానమంత్రితో సమావేశం. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు సహా విభజన హామీలపై , అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా, రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటి కీలక అంశాలపై కలిసే అవకాశం ఉందన్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలను కూడా ముఖ్యమంత్రి కలవనున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.