డిసెంబర్ ఒకటిన ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ భేటీ

రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండిని సిఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని, అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సిఎం కోరారు. డిసెంబర్ 1న మద్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని, వారికి ప్రగతి భవన్ లోనే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సిఎం చెప్పారు.మద్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు.ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకశంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండి, ఇ.డి.లు, ఆర్.ఎం.లు, డివిఎంలను ఆహ్వానించారు.

ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకోవడానికి అనుమతించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎంను అజయ్ కుమార్ కలిశారు.ఆర్టీసీ మనుగడ కాపాడడానికి ప్రభుత్వం తరుఫున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందుకు, కార్మికులతో నేరుగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందుకు సీఎం కు అజయ్ ధన్యవాదాలు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *