కిరణ్ బేడీకి.. నగ్మా వార్నింగ్.. ఎందుకు?
పవర్ ఫుల్ లేడీగా పేరు తెచ్చుకుని.. రాజకీయాల్లో ప్రవేశించి.. బీజేపీ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.. కిరణ్ బేడీ. తర్వాత.. ఆమె సేవలను.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బీజేపీ వినియోగించుకుంటోంది. మరోవైపు.. సీనియర్ హీరోయిన్ నగ్మా.. కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ గా ఎదుగుతోంది. ఎలాంటి ఇష్యూపై అయినా.. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో తన పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ.. నగ్మా పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతోంది.
ఎవరి దారిలో వారున్న ఈ ఇద్దరి మధ్య… పుదుచ్చేరి రాజకీయాలు.. చిచ్చు పెడుతున్నాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కుట్ర చేస్తున్నారని నగ్మా ఆరోపిస్తోంది. బేడీ.. బీజేపీ ఏజెంట్ లా పని చేస్తున్నారని కామెంట్ చేసింది. ప్రజా సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించింది.
ఈ విషయంపై.. రాజ్ భవన్ తో ఎంతవరకైనా పోరాడతామని నగ్మా స్పష్టం చేసింది. అలా.. కిరణ్ బేడీకి నగ్మా వార్నింగ్ ఇచ్చేసింది.