గోవా ఐటీకి తెలంగాణ సహకారం

ఐటి పరిశ్రమ అభివృద్ది కోసం గోవా-తెలంగాణ ప్రభుత్వాల మద్య కుదుర్చుకున్న నాలెజ్డ్ ట్రాన్స్ ఫర్ ఒప్పందంలో భాగంగా మరో ముందడుగు పడింది. తమ రాష్ట్రంలో ఐటి పరిశ్రమ అభివృద్ది కోసం సహాకరించాల్సిందిగా గతంలో గోవా ప్రభుత్వం తెలంగాణను కోరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి రోహాన్ కౌంటే  ఇవాళ హైదరాబాద్ లో ఐటి శాఖ మంత్రి కెటి రామారావుతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఐటి పరిశ్రమ అభివృద్ది, ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు గోవా ఐటి శాఖ మంత్రి, అధ్యర్యంలో అధికారుల బృందం రెండు రోజుల పర్యటనకు వచ్చింది.

గోవాలో ఐటి పరిశ్రమ అభివృద్దికి తెలంగాణ సహాకారాన్ని కోరుతున్నామని గోవా ఐటి శాఖ మంత్రి రోహాన్ కౌంటే తెలిపారు. తమ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ప్రారంభ దశలో ఉన్నదని, అందుకే తాము మెదట స్టార్టప్స్, ఇన్నోవేషన్  రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వినూత్నమైన కార్యక్రమాలతో రాష్ట్ర విభజన తర్వత ఐటి పరిశ్రమను నిలబెట్టిన తీరును అయన ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ గవర్ననెన్సు, ఇన్నోవేషన్, డిజిటల్ లిటరసీ రంగాల్లో మద్దతు తీసుకుంటామని తెలిపారు. అయా అంశాల మీద తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామరావుతో చర్చించారు.

ఈ రోజు గ్రాండ్ కాకతీయ హోటల్లో జరిగిన సమావేశంలో ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలంగాణ ప్రభుత్వ ఐటి పాలసీలను, ముఖ్యంగా వివిధ సెక్టార్ల వారీగా ఉన్న పాలసీలను వివరించారు. దీంతోపాటు టి హబ్, టాస్క్, టీ వర్క్స్ వంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా గత మూడు సంవత్సరాలల్లో తెలంగాణ ప్రభుత్వం ఐటి రంగంలో చూపిన అభివృద్దిని మంత్రి వివరించారు. గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఐటి పరిశ్రమ అభివృద్ది కోసం చేసిన పలు కార్యక్రమాలను, పాలసీలను మార్చుకున్న తీరుని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.

సాప్ట్ వేర్ హబ్ గా ఉన్న హైదరాబాద్ ఐటి పరిశ్రమ బలాన్ని ఉపయోగించుకుని, టి హబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అవిష్కరణలు, స్టార్టప్స్ కు చేయూత ఇచ్చామని మంత్రి తెలిపారు. మూడు సంత్సరాల క్రితం కేవలం వందల్లో ఉన్న స్టార్ట్ అప్స్ సంఖ్య ఈ రోజు 3000 వేలకుపైగా పెరిగాయని, హైదరాబాద్ నగరం దేశ స్టార్ట్ అప్ క్యాపిటల్ గా మారిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కేవలం ఐటి ఇకోసిస్టమ్‌కు సహాకారం అందిచామన్నారు. నగరంలోని ప్రఖ్యాత  విద్యాసంస్ధలు, పరిశ్రమ వర్గాలను కలుపుకుని వినూత్నమైన పద్దతిలో టి హబ్ తయరు చేసామన్నారు. ఇదే విధంగా టాస్క్, టీవర్క్స్ ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు.

మరోవైపు టి ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గోవా ప్రభుత్వం ఇప్పటికే గ్రామ పంచాయితీ వరకు భారత్ నెట్ ద్వారా ఇంటర్నెట్ ఇచ్చారని, అధునాతన వైఫై విధానంలో గ్రామాల్లో ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని గోవా మంత్రిని కోరారు. తెలంగాణ గోవా ఐటి పరిశ్రమ అభివృద్దికి కావాల్సిన సహాకారాన్ని అందిస్తుందని, ఈవిధంగా రెండు రాష్ర్టాలు చేస్తున్న ప్రయత్నం నిజమైన ఫెడరల్ స్పూర్తికి అద్దం పడుతుందని మంత్రి కెటి రామారావు కొనియాడారు. ఈ సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు ఇతర ఉన్నతాధికారులున్నారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *