త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం: కేటిఆర్
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ ఫొటోను ట్వీట్ చేసిన ఆయన.. ‘‘హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయిన నేడు. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం. జై తెలంగాణ, జై హింద్’’ అని ట్వీట్ చేశారు. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి,పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.