అఖిలేష్‌ను కలిసిన కేటీఆర్‌

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ను మంత్రి కేటీఆర్‌ మంగళవారం లఖ్‌నవ్‌లో కలిశారు. ఈ మేరకు అఖిలేష్‌తో ఉన్న ఫోటోను తన ట్విట్టర్‌లో పెట్టి కేటీఆర్‌ ఆనందాన్ని పంచుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అఖిలేశ్‌ను కలిశానని, అత్యంత సాధారణమైన, ఆకర్షణీయమైన సీఎంను కలుసుకున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తెలంగాణలో చేపట్టిన పలు పథకాలను సీఎం అఖిలేష్‌ అభినందించడమే కాకుండా ఆ రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు తమకు పదోన్నతులు ఇవ్వాలంటూ గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రిని కలిసిన వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌, ఆయనకు వినతి పత్రం సమర్పించారు. అర్హులైన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించి, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఇళ్లులేని వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తులపై మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌ తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *