మహాశివరాత్రి జాతర ఏడుపాయల్లో వైభవంగా
మెదక్: ఏడుపాయల్లో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు వైభవంగా రాష్ట్ర మంత్రి హరీష్రావు ఉత్సవాలను ప్రారంభించి వనదుర్గా మాతకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, మదన్రెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో దేవాలయాలకు అన్యాయం జరిగిందని చెప్పారు. వచ్చే శివరాత్రి నాటికి కాళేశ్వరం నీరు మెదక్ జిల్లాకు రానున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం పనులను చేయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను సీఎం అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఏడుపాయలకు వచ్చే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మెదక్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్రావు వెల్లడించారు.