మహేంద్రసింగ్‌ ధోని సత్యసాయిబాబా ఆశ్రమానికి…

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మంగళవారం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయిబాబా ఆశ్రమానికి వచ్చారు.  సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ఎంఎస్ ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక కాన్వాయిలో ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం పుట్టపర్తిలోని హిల్‌ వ్యూ స్టేడియంను పరిశీలించారు. తర్వాత పుట్టపర్తి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆస్పత్రిని పరిశీలించిన ధోనికి బాబా విశిష్టత, సేవా కార్యక్రమాను ట్రస్ట్‌ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ మట్లాడుతూ.. పర్సనల్‌ డాక్టర్‌ పుట్టపర్తిలో ఉండటంతో వైద్య పరీక్షల నిమిత్తం పుట్టపర్తికి వచ్చానని కెప్టెన్‌ వెల్లడించారు. సత్యసాయిబాబా చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయని ధోనీ అన్నారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ధోనిని ఘనంగా సన్మానించారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *