మహేశ్ బాబు మోకాలికి శస్త్ర చికిత్స అవసరమని

గతంలో ఆగడు సినిమా షూటింగ్‌ సమయంలో మహేశ్ బాబు మోకాలికి గాయమైంది. అయితే దానికి శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పినప్పటికీ.. ఆయన దాన్ని తేలికగా తీసుకున్నాడట. ‘స్పైడర్‌’ చిత్రం తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించినప్పటికీ ఎక్కువ కాలంపాటు సినిమాలకు విరామం ఇవ్వాల్సి వస్తుందని మహేశ్‌ ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ‘సరిలేరు నీకేవ్వరు’  సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న ఆయన సర్జరీకి ఇదే సరైన సమయమని భావించినట్టు సమాచారం. ఈ క్రమంలో కుటుంబంతో సహా న్యూయార్క్‌కు వెళ్లిన మన సూపర్‌స్టార్‌ శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యాడని కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఈ నెల చివర్లోనే మహేశ్‌ మోకాలికి సర్జరీ చేయించుకోనున్నారని ఆ వార్తల సారాంశం. అదేగనుక నిజమైతే ఆయన మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోక తప్పదు. దీంతో మన సూపర్‌స్టార్‌ తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్‌ చెప్పాల్సిందే. అయితే తను శస్త్రచికిత్సను అమెరికాలో చేయించుకుంటాడా, లేక హైదరాబాద్‌లో చేయించుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక నమ్రత శిరోద్కర్‌ సైతం మహేశ్‌ తన సినిమాలకు కాస్త విరామాన్నిస్తున్నట్లు తెలిపింది. రెండు సంవత్సరాలపాటుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నందున, కొంతకాలం తన పిల్లలకు సమయం కేటాయించేందుకే సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. కాగా, ఆయన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటిన సంగతి తెలిసిందే..!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *