టీజర్ : మహేష్బాబు విజన్ ఆఫ్ భరత్.. జనం కోసం
ప్రిన్స్ మహేష్బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన విజన్ ఆఫ్ భరత్ ప్రత్యేక టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అభిమానులను థ్రిల్ గురిచేసేలా ప్రిన్స్ విజన్ ఆఫ్ భరత్ను రూపొందించారు. రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజకీయ నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
విజన్ ఆఫ్ భరత్ రిలీజ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలోని లోపాలు, విధానాలపై మహేష్బాబు సెటైర్ వేశారు. దేశం వెనుకబడి ఉండటానికి కారణాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలోని లోపాల గురించి ఆయన చర్చించే ప్రయత్నం చేశారు.
శ్రీమంతుడు తర్వాత మహేష్బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రిన్స్కు జంటగా కైరా అద్వానీ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.