స్నాప్ డీల్ పై కేసు

ఆన్‌లైన్ షాపింగ్ సైట్ స్నాప్ డీల్ చిక్కుల్లో పడింది. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందన్నఆరోపణల నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త ఇందర్‌మోహన్ సింగ్ హనీ ఫిర్యాదు మేరకు స్నాప్‌డీల్‌ సీఈవో కునాల్ బాల్, సీవోవో రోహిత్ బన్సల్ చీటింగ్‌ కేసు నమోదైంది.  వ్యాపారవేత్త ఇంద్రమోహన్‌ సింగ్‌ హనీ జూలై 17న   ఉడ్‌ ల్యాండ్‌ బెల్ట్‌, వాలెట్‌ లను స్నాప్‌డీల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ చేశాడు. ఈ బ్రాండెడ్‌ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు చేరడంతో, వాటిని ఉడ్‌ల్యాండ్‌ షోరూంకి వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అవి నకిలీవని ఉడ్‌ల్యాండ్‌ సిబ్బంది కూడా ధృవీకరించారు. దీంతో స్థానిక గుమన్‌పురా స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇంద్రమోహన్‌ ఫిర్యాదు ఆదారంగా   సెక్షన్ 420 కింద  కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మనోజ్ సింగ్ సికార్వాల్ తెలిపారు.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *