మోదీ ”గోల్డ్” నిర్ణయం వెనుక మన్మోహన్

బంగారం విషయంలో పరిమితులు పెట్టిన కేంద్రం ప్రభుత్వం.తన నిర్ణయాన్ని ఎంతవరకు అమలు చేస్తుందనే విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. అయితే ఎప్పటికైనా బంగారం విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అమలు చేస్తుందనే భయంతో సామాన్యులు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే అసలు ప్రధాని నరేంద్రమోదీకి బంగారం విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు మోదీకి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సలహా ఇచ్చిన వారే… బంగారంపై ఈ రకమైన నిబంధనలు పెట్టాలని సూచించినట్టు చెబుతున్నారు.

మరికొందరు మాత్రం మోదీ నిర్ణయం వెనుక మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ ఆలోచనలు కనిపిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. గతంలో మన్మోహన్ సింగ్ ఒకానొక ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ ఈ నిర్ణయం తీసుకోవడంలో అడ్డుపడిందని… కానీ బీజేపీ మాత్రం నరేంద్రమోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుచెప్పలేకపోతోందని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బంగారంపై మోదీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆలోచన మన్మోహన్ దే అని ప్రచారం జరిగితే… బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో ఇరకాటంలో పడే అవకాశాలు ఉన్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *