9 ఏళ్ల వయసులో తప్పిపోయి..
30ఏళ్ల జ్ఞాపకాలను పేగు బంధాతంతో ముడిపెట్టిన క్రెడిట్ సోషల్ మీడియా కొట్టేసింది. విశాఖ జిల్లాలో ఈ అపూర్వ ఘటన చోటుచేసుకుంది. విశాఖ జిల్లా అరకు వ్యాలీలో పుట్టిన గంగాధర్ అందరిలాగే చిన్నతనంలో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపాడు. కానీ, అనుకోకుండా ఒకరోజుతొమ్మిదేళ్ల వయసున్నప్పుడు రైల్లో తప్పిపోయి చెన్నైలో తేలాడు. అక్కడి పోలీసులు అతన్ని ఈ సేవా చక్ర అనాధాశ్రమంలో చేర్పించారు. అప్పట్లో పత్రికా ప్రకటన ఇచ్చినప్పటికీ ఎవరూ రాకపోవడంతో… గంగాధర్ అని పేరుపెట్టి ఐటిఐ వరకు చదివించారు. ప్రస్తుతం గంగాధర్ LICలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో అరకు గిరిజన మ్యూజియంని చూడడంతో గంగాధర్కు గతం కొంత మేర గుర్తుకు వచ్చింది. వెంటనే చెన్నై పోలీసుల సహకారంతో ఏజెన్సీకి తరలి వచ్చాడు. ప్రస్తుతం గంగాధర్ను అతని పేరెంట్స్కు అప్పగించే పనిలో విశాఖ పోలీసులు ఉన్నారు. తన తల్లిదండ్రులను కలవబోతున్నందుకు ఆ యువకుడు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం గంగాధర్ తల్లి మాత్రమే ఉందని, తండ్రి చనిపోయినట్లు చెబుతున్నారు.