భారత సైన్యాధ్యక్షుడిగా ఎంఎం నరవనే
న్యూఢిల్లీ: భారత సైన్యం వైస్ చీఫ్గా లెఫ్ట్నెంట్ జనరల్ ఎస్కె సైనీ నియమితులయ్యారు. వైస్ చీఫ్ పదవిలో ఉన్న లెఫ్ట్నెంట్ జనరల్ ఎంఎం నరవనే భారత సైన్యాధ్యక్షుడిగా నియమితులు కావడంతో ఆ పదవి ఖాళీ అయింది. దీనితో దక్షణి కమాండ్ చీఫ్గా ఉన్న లెఫ్ట్నెంట్ జనరల్ ఎస్కె సైనీని ఆ పదవిలో నియమించారు. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.