కల్వకుంట్ల కలెక్షన్స్..చీరలమ్మిన ఎంపీ కవిత

గులాబీ కూలి దినాల్లో భాగంగా నిజామాబాద్ ఎంపీ కవిత చీరలమ్మారు. టీఆర్‌ఎస్ కూలి పనుల్లో భాగంగా నిజామాబాద్ ఎల్వీఆర్ షాపింగ్ మాల్‌లో ఎంపీ కవిత వినియోగదారులకు చీరలు అమ్మారు. శ్రమదానానికి ఫలితంగా ఎంపీ సుమారు ఏడు లక్షల రూపాయలను ఆర్జించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీఆర్ఎస్ పార్టీ గులాబీ కూలీ దినాలుగా పాటిస్తుంది. గులాబీ కూలీ దినాల్లో కార్యకర్తలు, పార్టీ నేతలు శ్రమదానం చేసి ప్లీనరీ, బహిరంగ సభకు విచ్చేసే నిమిత్తం ఎవరి సొంత ఖర్చులకు వారే సంపాదించుకోవాలని సీఎం సూచించిన విషయం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *