మీరు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా…
పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో అమిత్షా, ముకేశ్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూ…‘అమిత్ భాయ్..మీరు నిజమైన కర్మయోగి. మీరు అసలైన ‘ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’. అప్పుడు గుజరాత్, ఇప్పుడు దేశమంతా మీలాంటి నాయకుడు ఉన్నందుకు హర్షిస్తోంది. దేశం ఇప్పుడు రక్షణ కవచాల్లో ఉంది’అని అన్నారు. అమిత్ షా మాట్లాడుతూ..‘2014 వరకు భారత ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. కానీ గత ఐదేళ్లలో..ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపొందించాం’ అని తెలిపారు.