మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమరుడిపై తుపాకులతో ఎటాక్.. పక్కా ప్లాన్..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ మీద కాల్పులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున అతడి నివాసంలోనే కాల్పులు చోటు చేసుకోవటం గమనార్హం.గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో విక్రం గౌడ్ చెయి, కడుపులోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు సమాచారం. విక్రంగౌడ్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. విక్రంగౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

12:30 గంటల తర్వాత విక్రంగౌడ్ ఇంటికొచ్చాడు. పూజలో పాల్గొనెందుకు ఉదయం నిద్రలేచాడు. ఇదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండుగుడు కాల్పులు జరిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  రాత్రి ఇంటికొచ్చేటప్పుడు ఎవరితోనో విక్రం ఘర్షణ పడ్డట్లు తెలిసింది. వాళ్లే వచ్చి విక్రంగౌడ్ పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. విక్రంగౌడ్ నివాసంలో లైసన్స్ లేని తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు తానే కాల్చుకున్నాడా లేక ఎవరైనా కాల్పులు చేసారా అన్న విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అపోలో ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *