ప్రస్తుతం మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య లేదన్నారు

మహాబూబ్‌నగర్‌: మహబూబ్ నగర్‌లో పట్టణ ప్రగతి ప్రణాళిక పురపాలక సదస్సులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలకు ప్రతి నెల నిధులు వస్తాయని తెలిపారు. మున్సిపల్ మంత్రిగా కెటిఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత వసతులు పెరిగాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో మంచినీటి కొరత లేకుండా చేస్తామన్నారు. ఇప్పుడు ఎన్నికైన కౌన్సిలర్లు అదృష్టవంతులన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య లేదన్నారు. ఈ సదస్సుకు ఎంపి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టె రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణ రెడ్డిలు ఉన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *