కేసిఆర్ పై మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన సిఎం కెసిఆర్ మాట తప్పారని మాజీ హోమ్ మంత్రి ఎమ్మెల్సీ నాయిని నర్సింహా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అనంతరం టిఆర్ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కెసిఆర్ ని కోరానని, మరోసారి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్త్నాని మాట ఇచ్చారని చెప్పారు. ఆ సమయంలో తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికైనా ఇప్పించమని అడిగాను కానీ అవేమీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. ‘హోంమంత్రిగా పనిచేసినా వాడిని. నాకెందుకు కార్పొరేషన్ పదవి? ఏ కార్పొరేషన్ పదవి ఇచ్చినా తీసుకోను. టిఎస్ఆర్ పార్టీలో నేను ఓనర్ నే. కేసిఆర్ మా ఇంటి పెద్ద. కిరాయిదార్లు ఎప్పుడు దిగిపోటారో తెలియదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.