నాని గ్యాంగ్ లీడర్ :ఐదుగురు ఆడవాళ్ళు వాళ్ళతో ఒకడు
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్లీడర్’. ఈ సినిమా ట్రైలర్ను నాని ట్విటర్ వేదికగా విడుదల చేస్తూ.. మొదటిసారి పెన్సిల్ రాసిన ఒక ఒరిజినల్ కథ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఒంటరిగా ఉంటున్న నాని వద్దకు ఓ చిన్నారితో కలిసి నలుగురు ఆడవాళ్లు వస్తారు. వారంతా నాని సాయంతో తమ పగ తీర్చుకుంటూ ఉంటారు. హలీవుడ్ చిత్రాలను చూసి నాని పుస్తకాలు రాస్తూ ఉంటాడు. అలా ఆయన ‘కిల్ బిల్’ సినిమా చూసి ‘రశీదును చంపు’ అనే పుస్తకం రాశాడనే విషయం ట్రైలర్ ప్రారంభంలో తెలుస్తోంది. ‘ఐదుగురు ఆడవాళ్లు, వాళ్లతో ఒకడు’ అంటూ ప్రతినాయకుడి పాత్రలో కార్తికేయ చెప్పిన డైలాగ్లు, నటన ఆకట్టుకున్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.