చారిత్ర‌క ఘ‌ట్టం.. హైద‌రాబాద్ మెట్రో ప్రారంభం

భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రో కల సాకారమైంది. మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలిసి మెట్రో పైలాన్ ను ఆవిష్కరించి ప్రారంభించారు. మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్రో యాప్, బ్రోచర్‌ను మోదీ విడుదల చేశారు. ఆ తర్వాత మెట్రో ప్రాజెక్టు ఆడియో విజువల్‌ను ప్రధాని వీక్షించారు.

మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ, గవర్నర్, సీఎం కేసీఆర్
మెట్రో రైలు ప్రారంభోత్సవం అనంతరం మియాపూర్ స్టేషన్ నుంచి కూకట్ పల్లి స్టేషన్ వరకు ప్రధాని మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణించిన వారిలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు ఉన్నారు.

మెట్రో రైళ్లను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ చిత్రాలతో పాటు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలు, వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, చార్మినార్, గోల్కొండ వంటి చిత్రాలతో అందంగా ముస్తాబు చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *