తెలంగాణ కొత్త అసెంబ్లీకి వేద మంత్రోచ్చరణల మధ్య భూమిపూజ
100కోట్లతో శాసన సభ,శాసన మండలి భవనాలను నిర్మించతలపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగు ముందుకు వేసింది. సీఎం కేసీఆర్ కొత్త అసెంబ్లీ కోసం ఎర్రమంజిల్ లో భూమి పూజ చేశారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య గడ్డపారతో పునాది తవ్వారు. కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టారు. మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్, ఇంద్ర కరణ్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశవరావు, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్ రావు, బాలరాజు, జీవన్రెడ్డి, రాజయ్య, ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భవనాలు పూర్తవగానే ప్రస్తుతం నాంపల్లిలో ఉన్న అసెంబ్లీ హాల్ను ఖాళీ చేసి హెరిటేజ్ భవనంగా సంరక్షించనున్నారు.