ఆ రాత్రి మోక్షజ్ఞ తో నిషిత్ కలసి..?

ఊహించిన దుర్ఘటన ఎదురుకావడంతో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ యుక్తవయసులోనే మరణించిన విషయం తెలిసిందే. నిషిత్ కారు ప్రమాదం జరిగింది తెల్లవారు జామున. అయితే ఆ రోజు రాత్రి నిషిత్ ఎక్కడికెళ్లారు ? ఏం చేసాడు ?అనే విషయాలపై చర్చ జరుగుతోంది. దీనిపై రకరకాల కథనాలు వస్తున్నాయి.నిషిత్ మంత్రి కుమారుడు కాబట్టి అతడికి సాధారణంగానే సెలెబ్రిటీల వారసులతో పరిచయం ఉంటుంది. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా నిషిత్ కు స్నేహితుడని అంటున్నారు. ఆ రాత్రి నిషిత్ మోక్షజ్ఞని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్ గా కొనసాగాలని నిషిత్ అప్పటికి భావిస్తున్నా అతనికి సినిమాల పట్ల కూడా అమితమైన ఆసక్తి ఉండేదని వార్తలు వస్తున్నాయి.

ఆ ఆసక్తితోనే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తో సినిమాని నిర్మించాలని నిషిత్ అప్పటీకే ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రమాదానికి ముందు రోజు రాత్రి నిషిత్ మోక్షజ్ఞ ని కలసి ఈ విషయం పై చర్చించాడని అంటున్నారు. బాగా రాత్రి అయిపోవడంతో అంతా ఇంటికి వెనుదిరిగారని ఆ క్రమంలోనే నిషిత్ ప్రమాదానికి గురయ్యాడని చెబుతున్నారు.గతంలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చిత్రంపై వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడూ నిషిత్ పేరు వినిపించలేదు. ఈ వార్తలన్నీ ఊహాజనిత కథనాలే అని కొట్టి పారేసే వారు లేకపోలేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *