భారత్-పాక్ మధ్య యుద్ధం: పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ దూకుడైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే భారత్ తో రోడ్డు రవాణా, రైలు రవాణా, విమాన రవాణా సేవలన్నిటిని నిలిపివేసింది. దౌత్యపరంగా తెగదెంపులు చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆ దేశ రైల్వే శాఖ మంత్రి షేక్ ఆశీడ్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఆ దేశ మీడియా ప్రకటించింది. అక్టోబర్ లో గాని, నవంబర్ నెలలో గాని రెండు దేశాల మధ్య వార్ జరగొచ్చని ఆయన చెప్పారు. దీనితో భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ఎల్ఓసీ పొడవునా స్పెషల్ గర్డ్స్, టెర్రర్ బృందాలు మోహరించాయి.