చెలరేగిన పాక్ మద్దతుదారులు
లండన్ లో భారత రాయభార కార్యలయం ఎదుట పాక్ మద్దతుదారులు చెలరేగిపోయారు. హై కమిషన్ భవనంపై పాక్ మద్దతుదారులు కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. హింసాత్మక నిరసనలతో భారత రాయబార కార్యాలయ భవనం పాక్షికంగా దెబ్బతిందని బ్రిటన్లో భారత హైకమిషన్ పేర్కొంది. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆగస్టు 15నా బ్రిటన్లో భారత రాయబార కార్యాలయం వద్ద జరిగిన నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్తో స్వయంగా మాట్లాడి అనంతరం తాజా ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. పాక్ మద్దతుదారుల హింసాత్మక నిరసనలను లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ఖండించారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో బ్రిటన్లో పాక్ మద్దతుదారులు హింసాత్మక నిరసనల బాటపట్టారు. మరోవైపు ఆర్టికల్ 370కి సంబంధించి భారత నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని అమెరికా, బ్రిటన్,రష్యా సహా ప్రధాన దేశాలన్నీ సమర్ధించాయి.