మోడీ ని పొగుడుతున్న పాకిస్తాన్ మీడియా
హైదరాబాద్: నల్లధనాన్ని అరికట్టడానికి 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని గొప్ప నిర్ణయమని పాకిస్తాన్ మీడియా భారత ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇలాంటి సాహస నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా దైర్యం ఉండాలి, అది అందరి వళ్ళ కాదు, పాకిస్తాన్ ప్రధాన మంత్రి వళ్ళ అయితే అసలు కాదు అని ఒక వక్త తెలిపారు.
500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు చేయడంతో, నల్ల ధనాన్ని అరికట్టడం మరియు ధరల నియంత్రణ కూడా జరుగుతుంది అని తెలిపారు. మోడీ నిర్ణయం దాయాధి దేశం పాకిస్తాన్ కి కూడా అర్థం అయ్యింది కానీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మరియు తృణమూల్ పార్టీ లకు అర్థం అవ్వడం లేదు, వీరికి అర్థం అయ్యేలా ఇక ప్రజలే చెప్పాలి మరి.