గగనతల మార్గాన్ని నిషేదించిన పాక్
పాకిస్థాన్ మరోసారి వక్ర బుధ్ధిని చూపించింది. జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పటికే ఎన్నో విధాలుగా భారత్ ను వ్యతిరేకించింది. ఈ సారి మరో కొలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ గగనతలంలో భారత విమానాలపై నిషేధం విధిస్తున్నామని మంగళవారం ప్రకటించింది. ఆఫ్గనిస్థాన్ వెళ్ళే భారత వాణిజ్య విమానాలపై కూడా నిషేధం వర్తిస్తుందని పాక్ సాంకేతిక మంత్రి ఫవాద్ చౌద్రి చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాట్టు వెల్లడించారు. ఇప్పటికే భారత్-పాక్ మధ్య సంఘౌటి ఎక్స్ ప్రెస్సులను పాక్ నిలిపి వేసింది. అంతేకాకుండా ఢిల్లీ-కరాచీ రోడ్డు మార్గాన్ని కూడా మూసి వేసింది. ఇప్పుడు గగనతలంలో భారత విమానాలను రద్దు చేసింది. దీని వల్ల అమెరికా యూరప్ వెళ్ళే భారత్ విమానాలను వేరే మార్గం గుండా పంపించాలి దీని వల్ల దూరం పెరగడమే కాక సమయం కూడా ఎక్కువ పడుతుంది.