ap లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి
రైతు బంధు, నేతన్న నేస్తం, కాపు నేస్తం ఇలా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ… రాజన్న రాజ్యం అంటూ చెప్పుకునే వైసీపీ సర్కార్ సామాన్యులపై పెట్రోల్ వాత పెట్టింది. ఆదాయం పెంచుకునేందుకు పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై ఇప్పటి వరకు 31శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా… దాన్ని 35.20శాతానికి, డీజిల్పై 22.25శాతం ఉన్న టాక్స్ను 27శాతం పెంచేశారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 2రూపాయల చొప్పున పెరిగాయి. 2018 సెప్టెంబర్లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో… అప్పటి చంద్రబాబు సర్కార్ 2 రూపాయల మేర పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా… ఇప్పుడు దాన్ని సీఎం జగన్ పునరుద్ధరించారు. గురువారం నాటికి ఢిల్లీలో లీటర్ పెట్రలో ధర 73.36పైసలుండగా, డీజిల్ ధర 66.36గా ఉంది. అమరావతిలో పెట్రలో ధర 77.94, డీజిల్ ధర 72.27గా ఉంది.ప్రజలపై భారం పడొద్దని చంద్రబాబు సర్కార్ పన్ను తగ్గిస్తే… జగన్ పెంచటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.