ప్రభాస్ ‘సాహో’ మూవీ టీజర్ లీక్.. షాక్‌లో డైరెక్టర్ సుజిత్ రెడ్డి?

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో టీజర్ రిలీజ్‌కు ముందే సోషల్ మీడియా, యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతున్నది. వాస్తవానికి ఈ టీజర్ ఈ నెల 28న బాహుబలి సినిమాతోపాటు ప్రేక్షకులకు అందించాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. అయితే వారి అభిష్టానికి భిన్నంగా బుధవారమే ఈ టీజర్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ఆ టీజర్ నిజమైనదేనా? లేక మరోటా అనే విషయం సందిగ్ధత నెలకొన్నది. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో 19వదనే సంగతి తెలిసిందే.

తలకు గాయమై.. సాహో టీజర్ భావిస్తున్న వీడియోలో తలకు గాయమై ప్రభాస్ కూర్చొని ఉంటాడు. విజ్వువల్ కనిపిస్తుండగానే వాయిస్ ఓవర్‌లో కొన్ని మాటలు వినిపిస్తుంటాయి. ‘వాడిపైన ఉన్న రక్తం చూస్తే తెలుస్తుంది. వాడిని చచ్చేంత కొట్టారని అని ఓ వ్యక్తి అంటే మరో వ్యక్తి వాడిపై ఉన్న రక్తం వాడిది కాదు. మనవాళ్లది అని అంటాడు. ప్రభాస్ ఇట్స్ షో టైమ్ అని అనడంతో టీజర్ ముగుస్తుంది.

ఈ టీజర్ మాత్రం టెక్నికల్‌గా సూపర్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కొన్ని దృశ్యాలను జూమ్ అవుట్ చేస్తూ సీన్ ఎలాబ్రేట్ చేయగా అది ప్రభాస్ కన్ను.. ఆ తర్వాత తల అని తేల్తుంది. ఆ సీన్ షూట్ చేసిన విధానం సినిమా టేకింగ్ అద్దం పట్టేలా ఉందనే అభిమానులు చెప్పుకొంటున్నారు.

ఏడాది క్రితం గ్రీన్ సిగ్నల్ ఏడాది క్రితం సుజిత్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాహుబలి2 సినిమా షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్ర షూటింగ్‌ను మొదలుపెట్టారు. అయితే వాస్తవానికి ఈ సినిమా అంతకుముందే ప్రారంభమైందని, ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరుచాలని దర్శకుడు సుజిత్ నిర్ణయించినట్టు సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *