నయన్ అంతుచూస్తానంటున్న ప్రభుదేవా..!

ప్రభుదేవా, నయనతార.. ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. ఆ టైంలో వారి హంగామా అంతా ఇంతా కాదు. ఓ దశలో పెళ్లికి రెడీ అయిపోయారు. పెళ్లి కోసం నయనతార హిందూ మతాన్ని స్వీకరిస్తే.. ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. కానీ, ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ వారి బంధానికి తెరపడింది. ఆ పరిణామాలతో నయన తార కొన్నాళ్ల పాటు సినిమాలను కూడా మానుకుంది. ఇప్పుడు ఎవరి పనులు వాళ్లు చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు.

అయితే, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. బ్రేకప్ తర్వాత ఎడమొహం పెడమొహంగా ఉన్న వీరిద్దరు త్వరలోనే ఓ సినిమాలో నటించబోతున్నారట.  దర్శకుడు చక్రి తోలేటి హీరోయిన్‌ ప్రాధాన్యతను కలిగిన ఒక కథను సిద్ధం చేసుకుని నయనతారకి వినిపించాడు. కథ నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఈ సినిమాకి ‘కొలై యుధీర్ కాలం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రభుదేవా ఎంచుకున్నారు. ప్రభుదేవా ఎంతమాత్రం ఆలోచించకుండా ఓకే అనడం ఒక విశేషమైతే, దర్శకుడి దగ్గర నయనతార ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయకపోవడం మరో విశేషం. ఈ సినిమా హిందీ వెర్షన్లో తమన్నా నటించనుండగా .. అక్కడ కూడా విలన్ ప్రభుదేవానే. మొత్తంగా నిజజీవితంలో కాకున్న తెరమీద నయన్ పాలిట  ప్రభుదేవా విలన్‌గా మారాడాని పలువురు చమత్కరిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *