మహేష్ కాదని రణబీర్ తో…

అర్జున్‌ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించిన సందీప్‌కు సూపర్‌ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కింది. అయితే ఈ లోగా బాలీవుడ్ లో అర్జున్‌ రెడ్డి రీమేక్‌ చేసే అవకాశం రావటంతో సౌత్‌ ప్రాజెక్ట్స్‌ ను పక్కన పెట్టి బాలీవుడ్‌ చేరాడు. అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్‌ బాలీవుడ్‌ లో కూడా రికార్డ్‌ లు సృష్టించటంతో ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్‌ మీదే దృష్టి పెడుతున్నాడు. అందుకే ముందుగా  మహేష్ బాబు తో అనుకున్న కథను కూడా ఇప్పుడు హిందీలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. గతంలో మహేష్‌కు చెప్పిన కథను ఇప్పుడు బాలీవుడ్ హీరోతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో  రణబీర్ కపూర్ కు కథ కూడా వినిపించినట్టుగా ప్రచారం జరుగుతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *